Thursday, December 23, 2010

సంతాన లేమి-పరిష్కారమార్గం


నేడు అనేక మంది సంతాన లేమితో బాధపడుతున్నారు.సంతాన లేమికి నివాసగృహ వాస్తుదోషం కూడా కారణం కావొచ్చు.జ్యోతిష్యశాస్త్ర రిత్యా గురుడు పుత్రకారకుడు..మరియు వాస్తు రిత్యా గృహ ఈశాన్యానికి గురుడు అధిపతి..కావున నివాసగృహ ఆవరణ ఈశాన్యం మిగిలిన దిక్కులకంటే ఎత్తైనా,ఈశాన్య స్థలం తగ్గిననూ ఈశాన్యం ఖాళీ లేకపోయిననూ ఆ గృహములో నివసించువారికి సంతాన విషయంలో,ఆరోగ్యరిత్యా సమస్యలు ఎదురౌతాయి.అందువల్ల గురు గ్రహ సంబంధమైన జపహోమాలు చేయడం వల్ల వాస్తుదోష నివారణ జరుగుతుంది.
                                                                                              -మంధా.వెంకటసూర్యనారాయణ శర్మ  

Monday, December 20, 2010

యువతరం రాజకీయాలు -జ్యోతిష్య విశ్లేషణ


నేడు దేశమంతా యువమంత్రం జపిస్తోంది.125 సంవత్సరాల చరిత్రకలిగిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వైపు ఆశగా చూస్తోంది.భావి ప్రధాని రాహులేనంటూ బహిరంగంగా ప్రకటిస్తోంది.అదే స్పూర్తితో బీజేపీ కూడా వాజ్ పేయ్,అద్వానీ వంటి వారిని పక్కకి జరిపి సుష్మాస్వరాజ్,అరుణ్ జైట్లీ,నరేంద్రమోడీ,గడ్కరీ,వరుణ్ గాంధీ వంటి యువనేతలను తెరపైకి తెస్తోంది.అలాగే లెఫ్ట్ పార్టీలు కూడా ప్రకాష్ కారత్ వంటి యువనాయకుల నాయకత్వంలో నడుస్తున్నాయి.నేడు యువత అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది.అలాగే రాజకీయ రంగంలోనూ.ఇంతకుముందు రాజకీయాలంటే వెనకడుగు వేసే యువకులు ఇప్పుడు రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారు.చేంజ్ అంటూ ఒబామా ఇచ్చిన స్ఫూర్తితో యువత ముందుకు కదులుతున్నారు. మన రాష్ట్రంలో కూడా యువకుడైన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అలాగే యువకుడైన జగన్ రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.అలాగే అన్ని సంఘాలు,అసోసియేషన్లను యువకులే నిర్వహిస్తున్నారు.కొంతమందిలో పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను గుర్తించవచ్చు.అలాగే మరికొంత మందిలో ఆయా పరిస్థితులను బట్టి నాయకత్వ లక్షణాలు బయటపడతాయి.మనలో నాయకత్వ లక్షణాలను గుర్తించి మెరుగుపర్చుకున్నట్లయితే మంచి నాయకుడిగా తయారుకావొచ్చు.జ్యోతిష్య శాస్త్ర పరంగా నాయకత్వ లక్షణాలను సులభంగా గుర్తించవచ్చు.జ్యోతిష్యపరంగా యువ నాయకులకు ఉండవలసిన ప్రధాన బలం గ్రహాల అనుకూలత.వీటిలో ప్రధానమైనవి 4.
1)గురుడు-జ్ఞానానికి కారకుడు
2)శని-ప్రజాదరణ కారకుడు
3)కుజుడు -భుజబలకారకుడు
4)రాహువు-మాయతో మర్మంతో అందరి మన్నన పొందడానికి కారకుడు..
.ఎంతటి నాయకులకైనా ప్రజాదరణ ముఖ్యం..అటువంటి ప్రజాదరణకు కారకమైనది శని .కొన్ని సార్లు ఎంతగా ప్రయత్నించినా ఎన్ని మంచిపనులు చేసినా ప్రజాదరణ లభించకపోవచ్చు దానికి కారణం ఆ గ్రహా బలం తగ్గడం..ఆయా గ్రహాలను బట్టి సరైన రెమిడీలు పాటించినట్లైతే గొప్ప నాయకులుగా గుర్తింపుపొందే అవకాశముంది.పైన చెప్పిన నాలుగు గ్రహాలలో ఏ గ్రహబలం తగ్గినా లేదా బలహీనంగా ఉన్నా,నీచ స్థానంలో ఉన్నాయువనాయకుల ఆలోచనలలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.అందువల్ల యువనాయకులు పైన చెప్పిన ఏ బలం తగ్గిందని భావన కలిగినా ..ఆ గ్రహా సంబంధమైనపరిహారాలను చేసినట్టైతే తప్పక మార్పు కనిపిస్తుంది. ఇది చాలా అవసరం ఒక్కసారి ప్రయత్నించి చూడండి.మంచి ఫలితాలను మీరే పొందుతారు.
            
  .నేటి యువకులే రేపటి నాయకులు ..దేశాన్నినడిపించేది నాయకులే కాబట్టి అటువంటి యువనాయకులు సమర్థులైతే దేశం సస్యశ్యామలమౌతుంది.కాబట్టి .అటువంటి యువకులకు జ్యోతిష్యపరంగా కొన్ని సూచనలు ఇవ్వడం మంచిదని భావిస్తున్నాను.


             -మంధా వెంకట సూర్యనారాయణశర్మ

Saturday, December 18, 2010

సంతానలేమి-వాస్తుదోష నివారణ


నేడు అనేక మంది సంతాన లేమితో బాధపడుతున్నారు.సంతాన లేమికి నివాసగృహ వాస్తుదోషం కూడా కారణం కావొచ్చు.జ్యోతిష్యశాస్త్ర రిత్యా గురుడు పుత్రకారకుడు..మరియు వాస్తు రిత్యా గృహ ఈశాన్యానికి గురుడు అధిపతి..కావున నివాసగృహ ఆవరణ ఈశాన్యం మిగిలిన దిక్కులకంటే ఎత్తైనా,ఈశాన్య స్థలం తగ్గిననూ ఈశాన్యం ఖాళీ లేకపోయిననూ ఆ గృహములో నివసించువారికి సంతాన విషయంలో,ఆరోగ్యరిత్యా సమస్యలు ఎదురౌతాయి.అందువల్ల గురు గ్రహ సంబంధమైన జపహోమాలు చేయడం వల్ల వాస్తుదోష నివారణ జరుగుతుంది.
                                                                                              -మంధా.వెంకటసూర్యనారాయణ శర్మ  

Friday, December 17, 2010

నేటి ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత


నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం.నేడు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని దాని ద్వారా  విష్ణు దర్శనం చేసుకుంటే మోక్షం కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.ప్రతినిత్యం ముక్కోటి దేవతలు బ్రహ్మముహూర్తకాలంలో ఉత్తర ద్వారం ద్వారా శ్రీహరి ని దర్శించుకుంటారు.ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం మానవులకు కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకునే వీలుంటుంది.ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది.అది శుక్రవారం రావడం.ప్రతీ శుక్రవారం తిరుమల లో శ్రీవారి నిజ రూప దర్శనం ఉంటుంది.ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ఉత్తర ద్వారం  ద్వార స్వామి వారి నిజరూప దర్శనం చాలా ప్రత్యేకమైనది కావున భక్తులందరూ స్వామి వారిని సేవించి శ్రీహరి కృపకు పాత్రులుకాగలరని మనవి.

Wednesday, December 15, 2010

యువనేత జగన్ జాతక విశ్లేషణ


గోచార రిత్యా మిధునంలో ఉన్న చంద్రుడి యొక్క దృష్టి సప్తమిలో ఉన్న కుజుడి మీద పడడం అదే విధంగా ధనుస్సులో ఉన్న కుజుడి యొక్క విశేష దృష్టి మీనంలో ఉన్న గురుడి మీద పడడం వలన చంద్ర మంగళ యోగం,గురు మంగళ యోగాన్ని కలిగే విశేషమైన ఫలితం జగన్ జాతకంలో ఆరంభమౌతోంది.ఏదేమైనప్పటి జనవరి 6 తర్వాత జగన్ జీవితంలో మంచి మార్పులు కనబడుతాయి.
                                                                               - మంధా వెంకట సూర్యనారాయణ శర్మ

కాంగ్రెస్ తిరోగమనం-జగన్ పురోగమనం


ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్(ఐ) స్థాపించబడిన తేదీ02.01.1978 ఉదయం 9.గంలకు.న్యూఢిల్లీలో.కాంగ్రెస్ స్థాపితమైన తేదీ రిత్యాదాని జాతకం బలహీన పడడం.. అదేసమయంలో జగన్ కాంగ్రెస్ ని వీడి బయటపడడం జరిగింది.ఇదే సమయంలో గురుడు మీన రాశి లోకి వచ్చి స్థిరపడడం..అలా స్థిరపడిన గురుడు  శుభదృష్టి సప్తమభావంలో కన్యాలగ్నం(జగన్)పై పడడంతో రాజకీయంగా జగన్ కి బలం పెంచుతుందని చెప్పవచ్చు..
                                                                 జగన్ జాతకం పై మరింత విశ్లేషణ తరువాతి టపాలో

Tuesday, December 14, 2010

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏంచేయాలి..?

మానవశరీరంలోక్యాన్సర్ నివారణకు మన వేదాలలో అనేక పరిహారాలు చెప్పబడ్డాయి.మంత్రశాస్త్రంలో కూడా అనేక నివారణోపాయాలు చెప్పి ఉన్నారు.జ్యోతిష్యశాస్త్ర రిత్యా క్యాన్సర్ వ్యాధి  సోకిన ప్రదేశం విషపూరితం కావడానికి రాహు గ్రహం ప్రధాన పాత్ర పోషించడం కనిపిస్తుంది.కాబట్టి నిత్యం రాహుగ్రహ జపం లేదా రాహుగాయత్రి స్తోత్రం జపించిన..ముందు ముందు వారికి క్యాన్సర్ వ్యాధి సోకే అవకాశం ఉండదని చెప్పవచ్చు.
                                                                                                                     -మంధావెంకటసూర్యనారాయణశర్మ